సచివాలయం వారిగా వాలంటీర్లు వైఎస్సార్ భీమా రిపోర్ట్ తెలుసుకొనే విధానం:


YSR Bheema Scheme:

 పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూప కల్పన చేసింది. 18-70 ఏళ్లు వయస్సు ఉన్నవారికి ఈ పధకం వర్తించనుండగా.. బియ్యం కార్డు ఉండి, కుటుంబం మీద ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం, లేదా సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి ఈ బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ పథకం కింద 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారు సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే 51–70 ఏళ్ల వయస్సు వారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు.

సచివాలయం వారిగా వాలంటీర్లు వైఎస్సార్ భీమా రిపోర్ట్ తెలుసుకొనే విధానం:

ముందుగా ఈ క్రింద ఉన్న లింక్ ను ఓపెన్ చేయండి 


🔻 మీ జిల్లాను ఎంచుకోండి 

🔻 మీ మండలం సెలెక్ట్ చేయండి 

🔻 తరువాత మీ సచివాలయం సెలెక్ట్ చేయండి

🔻 వాలంటీర్ క్లస్టర్ ఐడీ సెలెక్ట్ చేయండి..

🔻 వాలంటీర్ వారీగా భీమ ఎన్ని నమోదయ్యాయి తదితర వివరాలు తెలుస్తుంది.


Next Post Previous Post
error: Content is protected !!
×
×