పేదలందరికి ఇల్లు


 పేదలందరికి ఇల్లు

పధకం లో భాగంగా ఇల్లు/ ఇంటి స్థలం కోరే పేదలందరికి , ఇంటి స్థలం మరియు పక్కా ఇల్లు నిర్మాణం

అర్హతలు

  • గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని లబ్ది దారులు ఎవరైనా విధిగా దారిద్య్ర  రేఖకు దిగువ వర్గంకు చెంది ఉండవలెను.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా లబ్ది దారునికి సొంత గృహము/ ఇంటి స్థలము ఉండరాదు.
  • గతంలో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏ విధమైన గృహపధకాలలో లబ్ది దారు ప్రయోజనం పొంది ఉండరాదు.
  • మొత్తం కుటుంబానికి మాగాణి 3 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఏకరాలలోపు ఉండవలెను.

జాబితాలో పేరు లేని వారు ధరఖాస్తు చేసుకునే విధానము

  1. అర్హత కలిగిన ధరఖాస్తు దారులు వారి ఆధర్ కార్డు మరియు భూమి యాజమాన్య ఆడంగల్ కాపీ ని జత చేసి ధరఖ్స్తును నేరుగా గ్రామ/ వార్డు సచివాలయాలో గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారగని ధరఖాస్తు చేసుకోవచ్చు
  2. అర్హులైన ధరఖాస్తు దారునికి YSR ( Your Service Request – మీ సేవల అభ్యర్ధన ) నెంబరు ఇవ్వబడుతుంది.
  3. ధరఖాస్తు చేసిన 90 రోజులలో అర్హులైన ధరఖాస్తు దారునికి ఇంటి స్థలం కేటాయించబడును

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!